తెలుగు భాష విశిష్టత - అచ్చంగా తెలుగు

తెలుగు భాష విశిష్టత

Share This
తెలుగు భాష విశిష్టత
శ్రీ ప్రియ



తెలుగు మాతృభాషగా కలిగిన వారి కోసం, తెలుగుని ప్రేమించే వారి కోసం, తెలుగు గురించి ఏమైనా తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసమే ఈ కానుక.

మన మాతృభాష తెలుగు గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు...
1. క్రీస్తుపూర్వం 400 వ శతాబ్దం నుంచి తెలుగు భాష ఉన్నట్లుగా ఆధారాలున్నాయి.
2. 2012లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ తెలుగును ప్రపంచంలోని రెండవ ఉత్తమ లిపిగా ఎంపిక చేసింది. కొరియన్ భాషకు కు మొదటి స్థానం దక్కింది.
3. మీరు తెలుగు భాష మాట్లాడితే, మీ దేహంలో ఉన్న 72 వేల నాడులు ఉత్తేజితమవుతాయి. ఇది ప్రపంచ భాషల్లోనే అత్యున్నత స్థాయి అని విజ్ఞాన శాస్త్రం ద్వారా నిరూపించబడింది.
4. శ్రీలంక లో ఉన్న జిప్సి అనే ఒక తెగ వారు అధికంగా తెలుగులోనే మాట్లాడతారు.
5. మయన్మార్ లో చాలా తెలుగు సంఘాలు ఉన్నాయి - గూగుల్ సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది.
6.16వ శతాబ్దంలో ఇటాలియన్ అన్వేషకుడయిన నికోలోడే కొంటి తెలుగు భాషలో ఉన్న పదాలన్నీ ఇటాలియన్ భాషలో లాగే అచ్చులతో అంతమవుతాయని కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్' అన్నాడు.
7. మానవజాతి శాస్త్రం యొక్క ప్రపంచ భాషల్లో అత్యధికంగా మాట్లాడే భాషల జాబితాలో తెలుగుకు 15వ స్థానం దక్కింది. భారతదేశంలో ఉన్న స్థానిక ఉపన్యాసకుల సంఖ్యాపరంగా (75 కోట్ల మంది )తెలుగుకు మూడవ స్థానం దక్కింది.
8. తెలుగు అన్న పదం త్రిలింగ అన్న పదం నుంచి వచ్చింది. త్రిలింగదేశం అంటే మూడు శివ లింగాలు ఉన్న దేశము అని అర్థము. హిందూ పురాణాల ప్రకారం శివుడు మూడు పర్వతాల మీద అ లింగా స్వరూపంలో వెలశాడు: నిజాం రాజ్యం లో ఉన్న కాళేశ్వరం, రాయలసీమలో ఉన్న శ్రీశైలం, కోస్తా జిల్లాల్లో ఉన్న భీమేశ్వరం. 
9. తూర్పు దేశాల్లో, ప్రతి ఒక్క పదము అచ్చుల శబ్దంతో అంతమయ్యే ఒకే ఒక్క భాష తెలుగు.
10. అత్యధిక సంక్యలో జాతీయాలు, సామెతలు ఉన్న  భాష తెలుగు.
11. తెలుగు భాషను ఇదివరకు తెనుంగు తెలుంగు అని కూడా అనేవారు.
12. భారతీయ భాషలన్నింటిలోకి తెలుగు తియ్యనయినదని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లుగా తెలుస్తోంది.
13. 200 ఏళ్ళ క్రితం సుమారు 400 మంది తెలుగు మాట్లాడే వారిని మారిషస్కు వ్యవసాయ పనివారుగా తీసుకొనివెళ్ళారు. ఇప్పుడు ఆ దేశం ప్రధానమంత్రి  కూడా వారి యొక్క వారసుడే.
14. 40 శ్లోకాలు ఉన్న ఒక విలోమ కావ్యం తెలుగులో ఉంది. దీన్ని మొదటి నుంచి చివరకు చదివితే రామాయణం, చివర నుంచి మొదటికి చదివితే మహాభారతం వస్తుంది మరే భాషలోనూ ఇటువంటిది లేదు.
15. శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాకుళం లో ఉన్న దేవుడిని సందర్శించి పూజించారు. అక్కడే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే కావ్యాన్ని అక్కడి దైవమైన ఆంధ్ర మహావిష్ణువు ఆజ్ఞపై రాశారు. అయినా దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు. అంటే మన దేశంలో ఉన్న భాషలన్నింటికంటే తెలుగు గొప్పది అని అర్థం. ఆంధ్ర మహా విష్ణువు శ్రీ కృష్ణదేవరాయలును తెలుగును ఆయన రాజభాషగా స్వీకరించమని ఆజ్ఞాపించారు.
16. తెలుగులో ఏకాక్షర పద్యాలు ఉన్నాయి. ఎంతో మంది గొప్ప మునులు తరచుగా చెప్పే మాట - సృష్టికర్త మనకిచ్చిన అతి గొప్ప వరం తెలుగు భాష.
17. ఆంధ్రప్రదేశ్ యొక్క సరిహద్దులు దక్షిణ తంజావూరు వరకూ ఉత్తరాన పాట్నా వరకూ ఉండేవట. వీరి రాజధానిగా ఔరంగాబాద్ ఉండేదట. ఇక్కడే శాతవాహనులు మొట్టమొదట పరిపాలించారు.

తెలుగువారయినందుకు గర్వించండి.

No comments:

Post a Comment

Pages