ఠీవీ రాణుల కథ - అచ్చంగా తెలుగు
ఠీవీ రాణుల కథ
శారదాప్రసాద్ 

(చిత్రం: లేపాక్షి గారికి కృతజ్ఞలతో)

"గృహమే కదా స్వర్గసీమ"అన్నాడొకాయన.ఆయన అన్నది ఆయన గృహాన్ని గురించా లేక పక్కవారి గృహం గురించా అని నాకు పెద్ద సందేహం.అదీఇదీ కాకపోతే ఆయన బ్రహ్మచారి అయినా అయి ఉండాలి.లేకపోతే గృహం అలా 
ఉండాలని ఊహించుకున్నాడో ఏమో!బహుశ: 
పూర్వం అలా ఉండి ఉండవచ్చు.ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మొన్న నా మిత్రుడు, ఒక కొత్త సూక్తి చెప్పాడు. అదేమిటంటే, "కొంప కాదు కొరివి"అని."పిల్లలందరూ స్థిరపడి మనవళ్ళతో హాయిగా గడుపుతున్న ఈతరుణంలో నీకు ఈ భావన ఎందుకు కలిగిందిరా?" అని వాడిని అడిగాను.ఇంక వాడు పూస గుచ్చినట్లు,తన ఆవేదన అంతా చెప్పుతున్నాడు ఇలా--"ఏమీలేదురా ఒక పాతికేళ్ళ ముందర వరకు నా జీవితం సాఫీగానే సాగింది.ఎప్పుడైతే,కొంపలోకి టీవీ వచ్చిందో అప్పటి నుండి బాధలు మొదలయ్యాయి. ఉద్యోగంలో ఉన్నంతకాలం హాయిగానే గడిచిపోయింది.ఆవిడ ఒక్కతే ఇంటిలోఎలా బిక్కుబిక్కు మంటూ ఉండేదా?
అని ఆలోచించేవాడిని. పదవీ విరమణ చేసిన తరువాత నాకు అసలు విషయం తెలిసింది.నేను అనుకున్నట్లుగా ఆమె బిక్కుబిక్కుమంటూ ఉండేది కాదు.మా ఇంటిలోనే ఆమెకు ఒక ప్రియసఖి ఉండేది.దానితో నిరంతరం హాయిగా కాలం గడిపేది. ఆ ప్రియసఖి మరెవరో కాదు, టీవీనే!సరేలే,మణులు అడిగిందా మాన్యాలు అడిగిందా! ఆమె దోవన ఆమె ఒక వ్యాపకం పెట్టుకొని కాలం గడుపుతుంది కదా అని భావించి ఆమె మీద కొంత సానుభూతి కూడా కలిగింది. 
అయితే, 
నేను విశ్రాంత జీవితాన్నిగడుపుతున్నరోజుల్లో,ఆమె వ్యవహార శైలిలో మార్పువచ్చింది.పగలు
 
ఇంటిపనులు,వంటపనులతో సరిపోయేది.మధ్యాహ్నం12గంటలకు భోజనం
 
చేస్తాం. 
ఆ తరువాత నుండి టీవీలో
 
ఏ ఛానల్ లో ఏ కార్యక్రమాలు ఏ టైంకు వస్తాయో ఆమెకు అన్నీతెలుసు.ముచ్చటగా12.30కు టీవీని ఆన్ చేస్తుంది. ఆ టైములో ఒక ఛానల్ లో
 
'మా పేట వంట' అనే కార్యక్రమం వస్తుంది.అందులో ఒకామె కొత్తరకాల వంటల గురుంచి చెబుతుంది.అంత వరకు బాగానే 
ఉం
ది.నా భార్య,'ఖాళీగా 
న్నారు కదా,ఆమె చెప్పేది కొద్దిగా వ్రాసిపెట్ట వచ్చుకదా!'అని అంటుంది.కాసేపు 
ప్రతిఘటిస్తాను. చివరకు, ఆమే గెలుస్తుంది.నేను ఒక పుస్తకం కొని అందులో
 
ఏ రోజు ఏ వంటకం గురించి ఆమె చెప్పిందో వ్రాయటం నావంతు అయింది.ఆమె కూడా
 
అదే సమయంలో మరొక పుస్తకం పట్టుకొని ఏదో 
వ్రాస్తుంది.
ఏమిటా అని ఒకసారి రహస్యంగా చూసాను.వంటలను గురించి చెప్పే ఆవిడ 
 
రకం చీర కట్టుకుంది, ఆ స్టవ్, మిగతా పాత్రలు ఎలా 
న్నాయి.... ఇలాంటి విషయాలు అందులో వ్రాసి 
న్నాయి.
తరువాత, ఒంటిగంట ప్రాంతంలో మరొక ఛానల్ లో ఒకాయన దడుచుకునేటట్లు  'జై .....వేదం', జై జై .........వేదం' అనుకుంటూ వస్తాడు. ఔషధాలను ఇంట్లోనే తయారు చేసుకోవటం గురించి ఆయన చెబుతుంటాడు.మరొక పుస్తకంలో
 
ఆయన చెప్పేవన్నీ వ్రాయమంది. తప్పదు కదా!అలానే వ్రాస్తున్నాను. ఈ రోజు ఆయన, జుట్టు నల్లగా 
నిగనిగలాడంటే,  'నీలిభ్రుంగరాజతైలం'
 
వాడాలని, దానిని ఎలా తయారు చెయ్యాలో చెబుతూ, కావలసిన వస్తువులను చెబుతున్నాడు. ఆయన జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఆయన జుట్టుకు రంగు వేసుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఆ మాట బయటికి అంటే మళ్ళీ యుద్ధమే!దానిని ఇంటిలోనే తయారు చెయ్యాలని ఆవిడ సంకల్పం.ఆయన చెప్పటం మొదలు పెట్టాడు.---ముందుగా ఒక రెండు
 
కిలోల స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తీసుకొని,స్టవును వెలిగించి ఒక పెద్ద బాణలిలో ఆ నూనెను పోసి,దానిలో ఆయన చెప్పిన మట్టీ,మశా
నాన్ని 
కలిపి,ఒక గరిటతో దానిని కలియపెడుతూ, మరగనీ, మరగనీ, 
మరగనీ....అని చెబుతున్నాడు. 
ఆయన, మరగనీ, మరగనీ
మరగనీ... అని చెబుతున్నకొద్దీ నా గుండె వేగంగా కొట్టుకుంటుందిఆయన చెప్పినట్లు మరగపెడితే,100 గ్రాముల నూనె తయారవుతుంది.ఒక సిలిండరు గాస్ అయిపోతుంది.మొత్తం లెక్కవేస్తే,100 గ్రాముల నూనెకు అయ్యే ఖర్చు దాదాపుగా 500 రూపాయలు అవుతుంది. అదే మందును,'బైద్యనాథ్'వారు అరలీటరు నూనె సీసాను 100 రూపాయల లోపే అమ్ముతుంటారు.ఆ కార్యక్రమం కూడా అయిపొయింది,మరొక ఛానల్ లో
 
'అత్తా కోడళ్ళు'
 
అనే సీరియల్ వస్తుంది.ఆవిడ దానిని చాలా నిశితంగా చూస్తుంటుంది.అప్పుడు కాసేపు కునుకు తీయవచ్చుకదా
 
అని సంబరపడిపోతాను. ఆ ఆశ నిరాశే అవుతుంది.లీనమై చూడటం వల్ల
 
ఆవిడ కూడా పెద్దగా ఏదో పాత్రను ఉద్దేశించి తిడుతుంటుంది.ఇంక
 
నాకు నిద్ర ఎలా పడుతుంది?కాసేపు నన్ను కూడా టీవీని చూడనివ్వవే! వార్తలు 
చూస్తాను,
అంటే,ఒక చిన్న టీవీని కొనుక్కొని వేరే రూంలో పెద్ద శబ్దం
 
రాకుండా పెట్టుకొని చూడండి అంటుంది.నోరు మూసుకొని కూచుంటాను. ఇక
 
సాయంత్రం మరొక 
ఛానల్ లో ఒక ప్రకృతి వైద్యుడు వస్తాడు. ఆయన
 
చేప్పేది
 '
మలబద్ధకం' గురించి. పొద్దున్ననిద్దుర లేచినప్పటి
 
నుండీ రాత్రి పడుకునే వరకూ నీళ్ళు తాగమంటాడు.అలా తాగితే
 
కడుపు చెరువవుతుందే!అంటే వినదు ఆవిడ.అలా రోజు మొత్తంమీద అయిదు లీటర్ల నీరుని తాగమని ఆయన చెబుతే,ఈవిడ పది లీటర్లు తాగిస్తుంది.
మలబద్ధకం తగ్గటం అటుంచి,అతి మూత్ర వ్యాధి పట్టుకుంది.టాయలెట్ కు పోయినప్పుడల్లా ఆ వైద్యుడే గుర్తుకొస్తాడు.
చీకటి పడింది. రాత్రి ఎనిమిది గంటలనుండి
 
సీరియళ్ళ తిరునాళ్ళ. 'చామంతి
రేకులు','మంధరకాండ','రాక్షసి'....ఈ సీరియల్సును ఏకబిగిని చూస్తుంది. అన్ని సీరియల్సులోనూ స్త్రీలే(పాత్రలు)విలన్లు. అత్త ఎవరో,కోడలు ఎవరో తెలియదు.వేష భాషలో తేడా కూడా కనపడదు. కొన్ని ఛానల్సులో,'మహిళ/వనిత/స్త్రీ'
లాంటి 
కార్యక్రమాలు వస్తుంటాయి.అందులో ఒక చర్చాకార్యక్రమం 
ఉం
టుంది.సినిమాలలో అసభ్యపు
 
పోస్టర్ల మీద,సినిమాలలో స్త్రీని అర్ధనగ్నంగా చూపించటం గురించి చర్చిస్తారు తప్ప,మన సంస్కృతికి మూల స్తంభాలైన స్త్రీలను విలన్లుగా చూపించే సీరియల్సు గురించి 
చర్చించరు.
బహు
శ :
వారు కూడా ఆ సీరియల్సును చూస్తుంటారేమో!సరే
 
ఈ రోజు గడిచింది.శని,ఆదివారాల్లో సీరియల్సు
 
ఉం
డవు.
 అప్పుడు
 
పుస్తకాలలో వ్రాసుకున్న వంట పాత్రలు,చీరలు,రకరకాల పచారీ సరుకులు కొనటానికి వెళ్ళుతుంటాం.మళ్ళీ
 
సోమవారం నుండి ఇదే తంతు.అందుకే,'కొంప కాదు కొరివి'అన్నాను.బాంక్ లో ఇంత పనిచేసినట్లయితే,జనరల్ మేనేజర్ ని అయి 
ఉం
డేవాడిని.రాసీ,రాసీ చేతులు 
నొప్పిపుట్టి,ఇక లాభం లేదు,శేష జీవితాన్ని ఇలానే గడపాలి కదా అని నిర్ధారించుకొని,ఒక లాప్ టాప్ ను కొనుక్కొని,దానిలో టైపు చేస్తున్నాను."
 
అని చెబుతూ జేబుగుడ్డతో కన్నీళ్లను
 తుడుచుకుంటున్నాడు. నాకెందుకో
 
వీడు కొద్దిగా అతిగా చెబుతున్నట్లనిపించి,సుబ్బారావు
 
గాడి కొంప కెళ్ళాను.కాలింగ్ బెల్ నొక్కగానే ఓరగా తలుపు తీసి ఆసుపత్రుల్లలో 'SSSSSHHHH...'
నర్సు బొమ్మలాగా  నోటి మీద వేలేసుకొని,"ఇప్పుడెందుకు వచ్చావురా?ఆ విషయమేదో ఫోన్ చేసి తగలబడొచ్చు కదా!"అని అసహనం వ్యక్తం చేసాడు.ఇప్పుడు
 
సీరియళ్ళ సమయం,నీతో మాట్లాడుతుంటే,నా భార్యకు అసౌకర్యంగా 
ఉం
టుంది.రేపు ఉదయమే
 
వాకింగ్ లో మాట్లాడుకుందాం."
 
అని తలుపువేసుకున్నాడు,నా సమాధానం కోసం చూడకుండా!సరే
 
అక్కడినుండి శేషగిరి కొంపకు వెళ్లాను.వాడు
 
ఏదో సీరియల్ లోని పాట పాడుతూ వచ్చి తలుపు తీసాడు.వాడు లోపలికి 
ఆహ్వానించాడు.కూర్చోమన్నాడు.కొంత ఆనందం కలిగింది.కానీ
 
వాడు నాతో మరేమీ మాట్లాడటం లేదు
నిన్న వాడి భార్య
 
ఒక సీరియల్ వేళలో పేరంటానికి వెళ్లిందట! అప్పుడు సీరియల్ లో జరిగిన ఎపిసోడ్ ను ఆమెకు చెబుతున్నాడు.ఆమె అడిగే ప్రశ్నలకు వాడు సమాధానం చెబుతున్నాడు.ఇదే తంతు చాలా సేపు జరిగింది.సీరియల్ వచ్చేది అరగంట సమయం అయితే,వీడు ఆమెకు దాన్ని ఒక గంట చెప్పాడు.విసుగుపుట్టి,"వెళ్లి వస్తారా!" అని వాడికి చెప్పి వెళ్లి పోయాను.ఇన్ని కొంపలు చూసిన తరువాత,'కొంప కాదు 
కొరివి' అని నా స్నేహితుడు చెప్పింది నిజమే అనిపించింది!
ఏం
 చేస్తాం!చేసుకున్నవాడికి చేసుకున్నంత సీరియళ్ళ బాధ!
(ఇది కేవలం హాస్య,వ్యంగ్య రచన.ఎవరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు.సరదాగా కాసేపు నవ్వుకోవటానికి వ్రాసినది మాత్రమే!)

***

No comments:

Post a Comment

Pages