శివం - 124
(నేను అనగా శివుడు)
రాజ కార్తీక్
విష్ణుమూర్తి ..వరద రాజ
బ్రహ్మ దేవుడు..కమల సంబ
(కార్తికేయుడు.. మా యొక్క ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత త్రిమాతలను చూసి తన ఆత్మ స్థితి తెలుసుకొని .. తీవ్రమైన భావోద్వేగం పొంది జయ ధ్వని చేసి.. ఆ తరువాత నేను అతని భుజం మీద చేయి వేసిన పిమ్మట మమల్ని కూడా నిజరూపంలో దర్శించుకున్నాడు )
అంతఃపురంలో
కళ్ళు తెరిచి నిద్రలో నుంచి లేచాడు రాజా హర సిద్దుడు..
హర సిద్దు " ఏమిటి ఇది .. నాకు కల ఇది నిజమా.. నాకు కనపడిన కుంభన్న. పరమేశ్వరులు లాగానే కలలో కూడా శివుడు అంతే కనపడ్డాడు.. అదనంగా పురజనము ఆశీస్సులు పూర్వజన్మ సుకృతంగా విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు అలాగే త్రిమాతలు కూడా కనపడ్డారు.. కలియుగంలో భగవంతుడి ప్రత్యక్షం కలలో జరుగుతుంది కదా.. నాకు జరిగిన కల కార్తికేయనికి నిజమా? లేక ఇది నా మానసిక భ్రమ ? ఏది ఏమైనా కార్తికేయుడు మాత్రం ఉత్తమోత్తమైన స్థితిలో ఉన్నాడని మాత్రం నేను అనుకుంటున్నాను.."అంటూ తన రాణిని నిద్ర లేపి వచ్చిన కల గురించి చెబుతున్నాడు
మహారాణి " మహారాజా ! చూడబోతే ఇదేదో గొప్ప దైవ లీల లాగా అనిపిస్తుంది.. మీరు ఎప్పుడైతే కార్తికేయునికి తగినంత పైకం ఇచ్చి పంపినారు అప్పటినుంచి నా ఎడమ కన్ను అదురుతూ అన్ని శుభశకునాలు గోచరిస్తున్నాయి.. మీరు ఎంత పట్టుదల గల వారు మా తండ్రిగారు.. ధర్మయ్య మావయ్య నాకు చెప్పారు.. మీరు ఒకనాడు మీ రాజ్య కొలువులో చేసిన వాదన వల్ల మీకు ఎదురైన శిక్ష.. ఆ తరువాత శివుడు చేసిన లీల మన రాజ్యంలో ప్రతి ఒక్కరి మదిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టినాయి.. అట్లానే ఆరోజు దర్బార్లో కార్తికేయుడు కళాకారుల భూమి కోసం చేసిన వాదన కూడా మీవలే నాకు గోచరించినది. కాకపోతే మీ పూర్వపురాజు వలె కాకుండా మీకు వాదన పట్టిమాతప్పులు ఓప్పులు వాద సంవాదాలు తెలియడం వల్ల క్షమించి.. అతనికి కేవలం హరసిద్దుని లాగా సహాయ సహకారాలు చేశారు.. మీ వంటి వారు.. సాక్షాత్తు పరమేశ్వరుడ్ను ప్రసన్నo చేసుకొని ప్రేమతో ఆయనతోనే తగువాడిన మీకు .. మీ మనసులో ఆ కార్తికేయుని పట్ల ఎంతో సోదర భావం కలదు అటువంటివాడు ఖచ్చితంగా దివ్యమైన దీవెనలతోనే వి రాజులు తున్నాడు అని నా నమ్మకం "
హర సిద్దా " దేవి! తమరు ఈరోజు ఈ క్షణమున ఇప్పుడు మాట్లాడిన మాటలు మీరు మా యందు చూపిన గౌరవంగా మేము భావిస్తున్నాము అలాగే కార్తికేయను చూసి.. ఆరోగ్యకరమైన అసూయలో ఉన్నాము ఈ కథ నిజమైతే అదే ఈ కల నిజమైతే "
.
..
నేను తలుచుకుంటే కానిదేముంది జరగనిదేముంది..
నా ప్రియ హారసిద్ధుడికి వచ్చిన కల నా సంకల్పమే..
మునుముందు కధ మీకే అర్థమవుతుంది..
కార్తికేయుడు తన ఆత్మ స్థితిలో ఉన్నాడు .
ఇంకా కార్తికేయుడికి మేము మా నిజరూపంలోనే కనబడుతున్నాము..
తల్లి దగ్గరికి పరిగెత్తిన పిల్లవాడివలె..
పరిగెత్తుకుంటూ అక్కడ మెట్ల మీద ఉన్న మీ త్రిమాతలు దగ్గరికి వెళ్తున్నాడు..
"నాకోసమే ఆకాశం నుంచి దిగి వచ్చారా మాతలు"
అంటూ ఎన్నో సంవత్సరాల నుంచి తన తల్లిని చూడకుండా తప్పిపోయిన పిల్లవాడు ఒక్కసారిగా తన తల్లి ఎదురైతే పడిన ఆనందంతో.. కళ్ల వెంట నీళ్లు తన భుజంతో తుడుచుకుంటున్నాడు
పరిగెడుతో పరిగెడుతూ.. తన మార్గమధ్యలో ఉన్న చెట్లకున్న పువ్వులని తెంపుకుంటూ పోతున్నాడు..
తన రెండు చేతులకి బాగా దట్టంగా ఉన్న పూలు.. ఎన్నో కోకోలుగా వస్తూ ఉన్నాయి.. అన్ని రకాల చెట్లు అక్కడ ఉండటంతో అన్ని రకాల పూలు కూడా ఆ గుంపులో ఉన్నాయి.. తన రెండు చేతులతో చేతికి అందిన పూలు మొత్తం పరిగెత్తుకుంటూ కోసుకుంటూ తన చేతుల్లోకి బుట్ట పూలు వచ్చే విధంగా తీసుకున్నాడు..
కార్తికేయ " అమ్మ తల్లి మీ ముగ్గురు ఒకటేనమ్మ మీ ముగ్గురు అందరూ నా తల్లులమ్మ.. రచనలు తప్ప ఏమీ చేయలేని నిరక్షరాసుడు ని.. నా సొంతగా రచనలు చేసి అదే కీర్తనలు అనుకునే అజ్ఞానిని.. నాకు తోచిన పూజ చేసి మీకు చేరుతుందని అనుకునే మూర్ఖుడినీ... రచన మీద రచన చేసి మిమ్మల్ని మెప్పిద్దామనుకునే మొండి వాడిని
.. మీ మీద రాసిన సన్నివేశాలు తలుచుకుంటూ కళ్ల వెంట నీళ్లు తెచ్చుకొని భావజ్యోతి చెంది మీకు చేరాయి అనుకునే తక్కువ వాడిని" అనుకుంటూ తమ దగ్గర ఉన్న పూలు ముగ్గురు మీద వేస్తూ దండాలమ్మ దండాలమ్మ దండాలమ్మ అంటూ.. ఆనందంగా బిగ్గరగా పూలు వెదజల్లుతున్నాడు.
"ఈ పూల జన్మ ధన్యమైంది అమ్మ. నా జన్మ ధన్యమైంది అమ్మ. ఈ ముగ్గురిని ఒక్కసారి చూట్టాం బ్రహ్మదేవుడు నా తలరాతలో రాసిన బహుమతి ఏమో , తల్లి దీవించండి అమ్మ అంటూ.. తప్పు చేస్తే క్షమించండి అమ్మ.. మానవ మాత్రం మానసిక తప్పులు ఉద్రేకపు తప్పులు అన్నీ క్షమించి.. నన్ను అన్ని రకాలుగా ఆదుకోండి అమ్మ అంటూ. ముగ్గురు మాతలు దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని.. అట్లానే ఉన్న ఫలంగా పడుకొని పాదాలు తాకుతూ పడుకొని ప్రదక్షిణలు చేస్తున్నాడు..
ముగ్గురు మాతలు చిత్విలాసంతో.. తధాస్తు తథాస్తుని దీవిస్తున్నారు..
కా "తల్లి శక్తి జ్ఞానము ధనము ఈ మూడు మాకు కావాలి తల్లి .. దయుంచి ఇవ్వండి అమ్మ "అంటూ హక్కుగా తల్లిని అడిగిన పిల్లవాడివలె జయ ధ్వని చేయసాగాడు..
నేను " ఏమి కార్తికేయ మీ మాటలను చూడగానే మమ్మల్ని మరిచావా " అని సరదాగా దెప్పి పొడిచాను
మమ్మల్ని చూసి కార్తికేయుడు అదే వేగంతో పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి
కా " తండ్రి పరమేశ్వర.. తండ్రి విష్ణు దేవా తండ్రి బ్రహ్మ దేవా " అంటూ మిగిలిన చెట్లకు మిగిలిన పూలు తీసుకొచ్చి.. మా మీద వేసి మాకు అంతే ప్రదక్షణ చేయసాగాడు..
నా చేతిని విష్ణు దేవుడు చేతిని ఒక చేతులు అదిమి పెట్టుకుని.. బ్రహ్మ దేవుడిని మరొక చేత్తో పట్టుకొని మీ త్రిమాతల వైపు తీసుకెళ్లసాగాడు..
మమ్మల్ని అంతే తీసుకువెళ్లి
సరస్వతి మాత పక్కన బ్రహ్మ దేవుని
పార్వతి మాత పక్కన నన్ను
లక్ష్మీదేవి పక్కన విష్ణుమూర్తిని
ప్రతిష్ట చేసినట్టు నుంచో పెట్టాడు.
ఇక చూడాలి కార్తికేయుడు వీరభక్తి ఆవేశం..
తల్లి తండ్రి తల్లి తండ్రి తల్లి తండ్రి అంటే పరీక్షణాలు చేసి తిరుణాలలో భగవంతుని ముందు నృత్యం చేసే వాడివలె ప్రదక్షణ చేస్తున్న నృత్యం చేస్తున్నాడు.
దేవతలందరూ.. ఆహా ఏమీ అతగాడు అదృష్టం..
త్రిమాతలని త్రిమూర్తులని ప్రత్యక్ష ప్రతిష్ట చేసే ప్రసన్నం చేసుకున్నాడు.. భగవంతుడు తన భక్తుడు యందు అందులోనూ కళాకారుడు యందు ఇంత పక్షపాతం వహిస్తాడా అని అనుకోసాగారు..
కార్తీకయుడు కి అక్కడ పంచామృతాలు కనపడ్డాయి బిందెలు బిందెలు..
మా ఆరుగురు మీద ప్రతిబింద అభిషేకం వలే పోశాడు..
ఇంకా తన్మయత్వం చాలని కార్తికేయుడు.. నీళ్లు తీసుకొచ్చి మా అందరి మీద అభిషేకం చేయసాగాడు..
మా భక్తుడు ఆనందమంటే మాకు ఆనందమే కదా
ఇక అభిషేకం అయిపోయింది అనుకొని మేము మళ్ళీ సాధారణ స్థితిలోకి వచ్చాము.
కార్తికేడు ఏం చేశాడు.. నన్నేమో అలంకరించాడు విష్ణు దేవుడు అభిషేకం చేశాడు మళ్ళీ..
నేను " కార్తికేయ ! నాయనా మాకు పంచామృత అభిషేకాలు నీటి అభిషేకం చేశావు ! ఇక శాంతించు నాయన " అని చలోక్తి వేశాను..
విష్ణు దేవుడు ( వరద రాజ ) " బావ మన దర్శకుడు కార్తికేయుడు మామూలోడు కాదు.. చూడు నేనేమో అలంకార ప్రియుడిని నాకు అభిషేకం చేశాడు నీవేమో అభిషేక ప్రియుడివి. నీకు అలంకారం చేశాడు.. బ్రహ్మ దవుని కూడా
అలంకారం చేశాడు.. అక్కడున్న నూతన చీరలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాడు వారు ఎదఫలంగా ఆ చీరలోకి మారిపోయారు."
కమల సంబ "పరమేశ్వర .. విష్ణు జనక.. ఏది ఏమైనా గానీ మీ ఇద్దరికీ జేరింది కదా.. మనందరికీ జేరింది కదా.."అంటున్నారు
రాముల వారి ముందు ఆంజనేయ స్వామి కూర్చున్నట్టు
. మారుగురు ముందు కూర్చున్నాడు.
మహారాజ హరసిద్ధుడికి .. ఈ దృశ్యాలు జరుగుతున్నట్లు లీలగా గోచరిస్తున్నాయి.
తర్వాత ఏం జరగబోతుంది చూద్దాం.
(సశేషం)
No comments:
Post a Comment