శివం - 123
(శివుడే చెబుతున్న కథలు)
రాజ కార్తీక్
(కార్తికేయ ను వృక్షాలలోనుండి మా ప్రదేశానికి తీసుకువచ్చాము..
వరదరాజుగా శ్రీమహావిష్ణువు నటరాజుగా నేను)
(నేను అనగా శివుడు,వరద - విష్ణువు,బ్రహ్మ - కమల సంబ)
ఈ ప్రదేశంలో కి త్రిమాతలు మరియు బ్రహ్మదేవుడు అవసరానుగుణంగా మరిన్ని దేవతాపాత్రలు లీనమై పోతాయి ఈ నాటకంలో మును ముందు మీకే తెలుస్తుంది
భక్తులారా ! పూజ అనేదానికి అసలైన అర్థము మీ ఇష్ట దైవాన్ని తలుచుకోవడమే.. అది ఏ ఏ రూపానైన.. భగవంతుని స్మరించుకోవడమే.. శాస్త్రానుగుణంగా చెప్పబడిన క్రతువులతో సహా కళాకారులు దేవతాపాత్రలా ఔచిత్యం దెబ్బతినకుండా తమ కల్పనలో భగవంతుని గురించి రాసినది కూడా కీర్తన కన్నా మక్కువ మాకు.. అందుకే భక్తులలో కూడా. కళ తో కూడిన భక్తిని మేము మరింత ఎక్కువగా ఆస్వాదిస్తాము.. దానికి ఉదాహరణ ఎంతోమంది కీర్తనపరులకు ఎంతోమంది కావ్యాలు రాసిన వాళ్ళకి మేము వారికి మరిన్ని లీలలు ప్రకటించాం.. అదే భక్తితత్వం .. అదే తన్మయత్వం అదే శివతత్వం..
పచ్చికలు దాటి వచ్చిన కార్తికేయుడు.. గణ నుంచి దిగ పోతుండగా అక్కడ చిన్న చిన్న సరస్సులు చూసి మనసు పులకించిపోతుంది అని ఎంతో ఆనందపడ్డాడు..
కా " గురువా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదమగా ఉంది ఈ ప్రదేశం .."
నేను " ఈ స్థలమంతా మన మాన్యమే .. ఇదిగో మా బావ ఈ స్థలం యొక్క పోషణ చూస్తాడు.. నేనే ఏమో మళ్లీ పంట వేళకు మాన్యమని సిద్ధం చేస్తాను "అంటూ మరో దిక్కు వైపు చూస్తున్నాను
వరద " బావ ఏం చేస్తున్నావ్ "
నేను " అదే మన కమల సంభవుడు ఎక్కడా అని చూస్తున్నాను "
వరద " మా బంధువులైన గురించే కదా వస్తాడులే వచ్చేదాకా ఓపిక పట్టు. మరీ నీ అభిమానులకు అన్ని ఒకేసారి దారాదత్తం చేయాలని చూడమాకు బావ.. అందరూ వస్తారులే "
నేను "ఒకేసారి మన ముగ్గురిని చూస్తే కార్తికేయుడు చాలా ఆనంద పడతాడని నా ఉద్దేశం బావ"
వరద " బావ మంచి బావ .. ఒకేసారి మనిద్దరిని చూశాడు .. మనిద్దరం ఒకటేనా మనిద్దరం చాలా చాలా అరుదుగా ఒకరికి కనబడతాము.. అలాంటిది నీ దగ్గర చిక్కుడు మహాదర్శికుడు గొప్ప రచయితకి ముగ్గురిని ఒకేసారి చూపించాలని ఆలోచిస్తున్నావా బావ "
కా " గురువుల్లారా ఆయన ఎవరో కలిసేటప్పుడు కలుస్తాడు లే కానీ.. నాకు ఈమాన్యమంతా చక్కగా చూడాలని ఉంది "
వరద " నీ కనుచూపుమేరా కనపడేదంతా మనదే ఇక్కడ నీకు ఎన్ని రోజులు ఉంటావు కదా ఆనందంగా ఆహ్లాదకరంగా అంతా చూడు అదే చూద్దువు గానిలే ముందు మా గురువులకు వెళ్లి కడుపు నింపుకుంద్వాగాని "
కా "అది సరేగాని ఇంత స్థలం మీరు ఎట్లా సంపాదించారయ్య "
వరద " ఒక మహారాజు పొట్టివాడైనా మా జేజయ్యకి ఈ స్థలము అంతా దానం చేశాడు అది మాకు వంశ పార్య పరంగా వస్తుంది.."అంటూ వామనుడు గురించి చూచాయిగా బదులిచ్చారు
కా " ఇందులో అన్ని రకాల పంటలు వేస్తారా"
వరద "అన్ని రకాల పంటలు ఉంటాయి.. కొన్ని పంటలు చీడ పాలవుతాయి.. కొన్ని కలుపు మొక్కలకు ఎదుగుతాయి.. కొన్ని పూర్తిగా సఫలం చెంది మా వద్దకు చేరుతాయి " అంటూ తత్వాన్ని విశదీకరించారు వరద రాజా
కా " చూడు గురువా పంటని భాగవతత్వాన్ని కలిపి చెప్పాడు వరద గురు"
నేను " ఆయన ఏం చెప్తే అదే దాన్ని మనం అనుసరించడమే"
కా " అలా అలాగే అలాగే కానిద్దాం "
నేను " మన మునుముందు ప్రణాళిక ఏంటో వివరించు కార్తికేయ "
కా" ముందు భోజనం తర్వాత ప్రణాళిక "
నేను " ఏమయ్యా కార్తికేయ మనం వెయ్యబోయే నాటకం ఏదో సoగ్రరప్తంగా ఏమన్నా చెప్తావా "
కా " చెబుతాలే గురువా వేచి ఉండు ! గురువుల్లారా ఎప్పుడు చెప్పాలా అప్పుడు చెప్తాను ఒక దర్శకుడుగా నాకు అది తెలుసు కదా "
వరద & నేను "చూడు బావ ఈ దర్శకుడు మనిద్దరిని ఆజ్ఞాపిస్తున్నాడు. నేను చెప్పింది చెయ్యి అన్నట్టు మాట్లాడుతున్నాడు "
నేను " ఏమి చేస్తాం వరద అభిమానులు దిగ్గజ దర్శకులు ఏమి చెప్తే అది వినాలి .. వారి యొక్క శ్రద్ధతో మనల్ని ఎట్లా కట్టిపడేస్తారు "
వరద "ఏరి కోరి తెచ్చుకున్న వ్యాపారం కదా తప్పుతుందా కానివ్వు బావ నీ ఆటలో మేమంతా పావులం "
కా " గురువుల్లారా ! మీ ఇద్దరికీ ఉన్న అర్థం చేసుకునే తప్పో ఒక భార్యాభర్తలకు కూడా ఉండదు సుమీ "
వరద " ఇప్పుడు ఆ విషయం కూడా చెప్పటం ఎందుకులే "అని మోహిని కథ గుర్తు చేశారు
ఇవన్నీ చూస్తూ కైలాస పరివారం అందరూ దేవతలందరూ ఎంతో ఆనందంగా నాటకం మొదలై చూస్తున్నట్లే సంతోషంగా చూస్తున్నారు
ఇంతకు మునుపే మహాదేవుడు తన మానసిక శక్తి ద్వారా అందరికీ రమ్మని చెప్పారు కదా ఎలా చేద్దామని బ్రహ్మదేవుడు త్రిమాతలని అడిగారు
త్రిమాతలు ఒక నవ్వు తో సమాధానం లభించినట్టు అలాగే చేద్దాం అని తక్షణమే సిద్ధమయ్యారు.. బ్రహ్మదేవుడు అదే మన కమల సంబవుడు
చూశారా భక్తులారా మాయ అంటే భగవంతుడు లీలా చేస్తే కళ్ళముందే అందరూ ఉన్న కనిపెట్టలేని అందమైన మాయలోకి వెళతాడు ప్రియమైన భక్తుడు
కా "గురువుల్లారా ! ఏదో కొద్ది వాడిని నన్ను మీరు ఇట్లా ఆడుకోబాకండి ఏదైనా మీ ఇద్దరు చెప్పినట్టే చేద్దాం, కాకపోతే కథ నాది కాబట్టి ఆ భగవంతుడు సంకల్పనా నాకు వచ్చింది కాబట్టి ఇదొక్కటి నా మాట వినండి అయ్యా "అంటూ అతను ఆజ్ఞ పాటిద్దాం అన్నదానికి సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడు
ఇంతలో హోరుగాలి మొదలైంది..
ఆ గాలి మరింత చల్లగా ఉంది
వరద " నువ్వు అడిగావు కదా బావ తెలిసినట్టుంది మన కమల సంభవ బావ కూడా వస్తున్నాడు , నువ్వు అనుకోవటం జరకపోవడమా "
దూరం నుంచి కార్తికేయుడు అతను ను కూడా చూస్తున్నాడు
కా " అబ్బా శివుడు విష్ణువు బ్రహ్మదేవుడు కూడా దొరికేశాడు"
నేను "ఏమయో కథలు చెప్పకుండానే పాత్రలు నిర్ణయిస్తున్నావ్;"
కమల సంభవ కూడా వేగంగా వరద నటరాజ దగ్గరకు చేరాడు
కమలసంబ " ఏమి నటరాజ ఎక్కడికి పోయినావు నీకోసం ఎదురు చూస్తున్నాము నువ్వు వచ్చావని తెలియగానే వరదరాజ కూడా వచ్చాడు మిగతా పనులు చూసుకుని నేను కూడా వచ్చాను "
కార్తికేయడు ఏమో కమల సంభవని ఎంతో ఆనందంగా చూస్తున్నాడు..
వరద "చూడు కమల సంబ ఇతగాడు కార్తికేయుడు.. నాటకం.. రాజ్యంలో కళాకారుల కోసం చేస్తున్న పోరాటం.. నటరాజ బావ ఆశీర్వాదం."అన్ని వివరంగా చెప్పాడు
కమల సంబ " దర్శక నీ కథల గురించి మాకు ముందే తెలుసు మా నటరాజ చెబుతూ ఉండేవాడు.. నీ ప్రదర్శనలు కూడా కొన్ని చూశాడు.. మాకు చెప్పాడు.. ఇరువురు ఏమి చేస్తారు నేను వాడిని అనుసరిస్తాను"
కా " మూడో గురువా.. వీళ్ళిద్దరి ఎట్లనో నువ్వు కూడా నాకు అట్లనే.. నిజంగా చెప్పాలంటే మీ ముగ్గురిలో ఎవరికి బ్రహ్మ విష్ణు శివుడి పాత్రలు ఇచ్చిన అందరూ సరిపోతారు.. కాకపోతే ఈ పెద్ద గురువు మొట్టమొదటిగా శివుడివేషన్లో కనపడ్డాడు కాబట్టి ఆయన శివుడు నా ఊహలో ఈయన విష్ణుగా సరిపోతాడు కాబట్టి విష్ణువు ఇక మిగిలింది నీవు బ్రహ్మదేవుడు వి "
కమల" సర్లే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కొంచెం ముందుకెళ్తే మా గృహ మందిరం ఉంటుంది.. వెళ్లి భోంచేసి అన్నీ తీరిగ్గా మాట్లాడుకొని చేద్దాం పదండి"అంటూ ముందుకు తీసుకెళ్లారు..
కానీ కార్తికేయుడు మాత్రం వెనక్కి చూస్తున్నాడు.
నేను "ముందు కడుపు నింపుకోవయ్యా తర్వాత అంత తిప్పి చూపిస్తాలే కానీ నేను "అనగానే నంది బృంగి గణ .. బ్రహ్మదేవుని ఎక్కిన హంసనీ అని ఎద్దు కూడా ఎంతో ఆనందంగా అంబ అంబా అంటూ ముందుకు కదిలము.
కొంచెం దూరం నడవంగానే అక్కడ పెద్ద మండపం లాంటి గృహం కనపడ్డది..
దూరంగా ఆ మండపంలో ముగ్గురు వేచి చూస్తున్నారు
వాళ్లని దగ్గరగా చూస్తూ కార్తికేయుడు మును ముందుకి ఎంతో వేగంగా కదులుతున్నాడు..
మునుముందుకు వెళ్తూ కార్తికేయుడు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టుకుంటూ కదులుతూ ముందుకు వెళ్తున్నాడు
అక్కడున్న ముగ్గురు మీ త్రిమాతలు అని వేరే చెప్పవలసిన అవసరం లేదు
కార్తికేయుడు మనసు నిజాన్ని తెలుసుకుని తీవ్రమైన భావోద్వేగం కి గురి అయింది
అక్కడ ఎన్నో మెట్లు ఉండటంవల్ల ఆ ముగ్గురు దేవతలు ఒక్కొక్క మెట్టు కిందకి దిగుతూ మడికట్టులో ఎంతో హుందాగా నిజంగా దేవతలే మారు మనిషి రూపంలో వచ్చారా అన్నట్లు కళకళలాడిపోతున్నారు
నేను కార్తికేయను దగ్గరకు వెళ్లి వెనుకు నుండి కార్తికేయని భుజం మీద చేయి వేశాను..
"నమోస్తుతే ఉమాదేవి లక్ష్మీదేవి సరస్వతి దేవి శరణం తవ శరణం .. చరణం సదా పూజనీయం .. జై జగదాంబ"అంటూ ఏడుస్తూ నినాదాలు చేయి సాగాడు
నా చేయి ఒత్తిడికివెనక్కి తిరిగి చూడగా
" పాహిమాం పరమేశ్వర మహాదేవ.. పాహిమాం బ్రహ్మదేవా.. పాహిమాం విష్ణు దేవా "
అంటూ పిచ్చి పట్టిన వాడివలె మా చుట్టూ తిమాతల చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు"
ఆహా ఏమీ అదృష్టం ఇది .. త్రిమూర్తులను త్రిమాతలను కొన్ని కథలు కొన్ని సన్నివేశాలు రాసి ఇంత ప్రసన్నం చేసుకున్నాడు ఈ కార్తికేయడు
ఇప్పుడేం జరగబోతుంది..
భక్తి అందులోను కళ తో కూడిన భక్తి ఎంత గొప్ప వ్యసనమో తెలియపడుతుంది..
(కొనసాగింపబడుతుంది)
No comments:
Post a Comment