గురు భక్తికి నిదర్శనం "ఏకలవ్యుడు" - అచ్చంగా తెలుగు

గురు భక్తికి నిదర్శనం "ఏకలవ్యుడు"

Share This

గురు భక్తికి నిదర్శనం "ఏకలవ్యుడు"

అంబడిపూడి శ్యామసుందర రావు 






మహాభారతం లోని ఏకలవ్యుని పాత్ర గురు భక్తిని చాటే  ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర ఇతను బోయ వంశానికి చెందినవాడు భారతం లో అతని పాత్ర బోయవంశం కు చెందిన ఒక యువ రాకుమారుడిలా ప్రవేశిస్తుంది.ఏకలవ్యుడు శ్రీకృష్ణునికి తండ్రియైన వాసుదేవుని సహోదరి శృతి దేవకి జన్మించిన వాడు.] ఆ తరువాత అతడు బోయరాజైనటువంటి హిరణ్యధనుస్సుచే పెంచబడ్డాడు. హిరణ్య ధనస్సు మగధ సామ్రాజ్యాధిపతి యైన జరాసంధుని సైన్యాధిపతి ఏకలవ్యుడు బోయ వంశానికి చెందిన వాడు  అవడం వల్ల ద్రోణాచార్యుడు అతనికి విలు విద్య నేర్పడానికి తిరస్కరిస్తాడు ఏకలవ్యుడు ఏ మాత్రం చెదిరిపోక బంక మట్టితో ద్రోణాచార్యుని విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహాన్ని ప్రతిష్టించుకొని ఆ విగ్రహమే  తన గురువుగా భావించి తానే సొంతంగా విద్య నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా అకుంఠిత దీక్షతో శ్రద్ధా భక్తులతో విద్యనభ్యసించిన ఏకలవ్యుడు అపారమైన ప్రతిభను కూడగట్టుకొని .విలువిద్యను నేర్చుకోవడం ప్రారంభించి ద్రోణాచార్యుని ప్రియ  శిష్యుడైన అర్జునునితో సమానమైన నైపుణ్యాన్ని సాధిస్తాడు ఈ విషయం ఏమి ద్రోణాచార్యడికి తెలియదు

ఒక రోజు ద్రోణాచార్యుడు అర్జునుడు ఇతరులను తీసుకొని విలువిద్య సాధనకు వేటకుక్కలను వెంట తీసుకొని అడవికి వెళతారు ఆ కుక్కలోని ఒక కుక్క ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్లి ఏకలవ్యుడిని చూసి మొరగటం మొదలు పెట్టింది ఏకలవ్యుడు తన సాధనకు కుక్క అరుపులు భంగము కలుగజేస్తున్నాయి అని  తలంచి కుక్క మొరగ కుండా నోటి చుట్టూ బాణాలను వేసి కుక్క నోరు మూయించి తన సాధన చేసుకోవడం మొదలు పెట్టాడు పాపం ఆ మూగజీవి బాణాలతో అర్జునుడు ద్రోణాచార్యుడు ఉన్న ప్రదేశానికి వచ్చింది కుక్కను నోటి చుట్టూ ఏడు బాణాలతో దాని నోరు మూయించిన విధానం చూసి తనకన్నా విలువిద్యలో ప్రావీణ్యము గలవాడు ఆ ప్రాంతాల్లో ఉన్నాడని భావించి ద్రోణాచార్యుడు అర్జునుడు ఇతరులు విచారించగా ఏకలవ్యుడు ఆ విధంగా బాణాలు వేసాడని తెలుసుకొని అతనిని చూడటానికి వెళ్లారు 

ఏకలవ్యుడు తన గురువు రాకకు సంతోషించి ఘనంగా స్వాగతం పలికాడు  ఏకలవ్యుని విలువిద్య ప్రావీణ్యానికి ద్రోణుడు సంతోషపడ్డా ఆ మూగ జీవి (కుక్క)ని అది తన సహజ ధర్మం ప్రకారం అరిచింది అనే చిన్న కారణం చేత దాని నోటి చుట్టూ 7 బాణాలు వేసి దాని నోరు మూయించటం అధర్మం ఇలా కోపాన్ని అదుపులో పెట్టుకోకుండా ధర్మం ,అధర్మం అని తేడా తెలియకుండా ప్రవర్తించే వాని వద్ద ఇంతటి విలు విద్య ఉంటే అది లోకానికి ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి రాబోయే ప్రమాదాలను పసిగట్టి ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు తన విలు విద్య ప్రదర్శించకుండా ఉండేందుకు అతని కుడి చేతి బొటనవేలు గురుదక్షిణగా అడిగాడు గురువు పట్ల ఎనలేని భక్తి ప్రవత్తులు ఉన్నవాడు అవడం వల్ల తన భవిష్యత్తును ఏమాత్రం ఆలోచించకుండా కుడి చేతి బొటన వేలుని కోసి గురుదక్షిణగా సమర్పించి చరిత్రలో ఆదర్శ శిష్యుడిగా నిలిచిపోయాడు. ద్రోణాచార్యుడు  బొటన వేలు గురు దక్షిణ గా తీసుకొని ఏకలవ్యునికి  చూపుడు వేలు, మధ్య వేలు తో బాణం వేయడం నేర్పించాడు.కానీ ఈ విషయాన్ని ద్రోణాచార్యుని విమర్శించే వారు ఎవరూ పట్టించుకోరు    

తరువాతి రోజుల్లో ద్రోణాచార్యుడు ఊహించినట్లుగానే ఏకలవ్యుడు జరాసంధుని కొలువులో చేరి జరాసంధునికి  విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు అంటే అధర్మం వైపు వెళ్ళాడు.జరాసంధుని కోరిక మేరకు శిశుపాలుడికి రుక్మిణీ దేవిని ఇచ్చి వివాహం జరిపించమని మధ్యవర్తిత్వం చేస్తాడు రుక్మిణి తండ్రి సోదరుడు కూడా రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటారు కానీ రుక్మిణి శ్రీకృష్ణుని వివాహం చేసుకొని వెళ్ళిపోతుంది తరువాతి రోజుల్లో జరాసంధుని సైన్యముతో ఏకలవ్యుడు మధుర రాజ్యం పై దాడి చేసి చాలా మంది యాదవులను సంహరిస్తాడు ఆ సమయంలో యాదవ రాజ్యాన్ని కాపాడుకొనే ప్రయత్నములో శ్రీ కృష్ణుడు ఏకలవ్యుడిని హతమారుస్తాడు ఆ సందర్భంలోనే ఏకలవ్యుడు తర్వాతి జన్మలో ద్రోణాచార్యుని చంపే వరం శ్రీకృష్ణుని నుండి పొందుతాడు. 

ఇదండీ ఏకలవ్యుని వృత్తాంతం కానీ నేటి జనం ద్రోణాచార్యుడు కులవివక్ష చూపించాడని,ఏకలవ్యుడు అర్జునుడిని మించి పోతాడని ఈర్ష్యతో ఏకలవ్యుని బొటన వేలిని గురుదక్షిణ గా అడిగాడని ద్రోణాచార్యుడు  లాంటి అత్యుత్తమ గురువును కించపరుస్తూ పుంఖాను పుంఖాలుగా వ్యాఖ్యలు వ్రాసారు ఆనాటి యుగధర్మం ప్రకారం ద్రోణాచార్యుడు వ్యవహరించారు రాజుల వద్ద ఉండవలసిన విలువిద్య లాంటి యుద్ధ విద్యలు ఇతరుల వద్ద ముఖ్యంగా ధర్మము అధర్మములు తెలియని వారి చేతిలో ఉంటే అనర్ధం అని మరియు ద్రోణాచార్యుడు భీష్ముని చే పాండవులకు కౌరవులకు గురువుగా  నియమింపబడ్డాడు కాబట్టి ద్రోణుడు ఇతరులకు విద్య నేర్పరాదు అది ధర్మ సూక్ష్మం నేటి గురువులు ప్రభుత్వం నుంచి భారీగా వేతనాలు తీసుకుని బయట ప్రైవేట్ గా క్లాస్ చెబుతూ లక్షలు సంపాదిస్తున్నారు  నేటి కలియుగ లక్షణాలను నాటి ద్వాపర యుగములో అన్వయించి విశ్లేషణ చేసి ఏకలవ్యుని కీర్తిస్తూ ద్రోణాచార్యుని కించపరచడం ఆయనకు లేని ఈర్ష్య ద్వేషాలను ఆపాదించటం సరి అయినది  కాదు.ఏకలవ్యుని కీర్తించి అతని గురు భక్తిని లోకానికి చాటి చెప్పటానికి ద్రోణాచార్యుని అసూయ పరునిగా చిత్రించనవసరం  లేదు పురాణాలలో ఏ పాత్ర కు ఆ పాత్ర గొప్పది అన్న విషయం గుర్తించాలి.

***

No comments:

Post a Comment

Pages