శ్రీథర మాధురి - 130
(పూజ్యశ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ అమృత వాక్కులు)
భగవంతునిచే ఇవ్వబడ్డ ఈ జీవితాన్ని ఆయన కానుక/ప్రసాదంగా భావిస్తూ, సంపూర్ణంగా జీవించాలి. ప్రస్తుత జీవితాన్ని మీరు ఒక భారంగా భావించి, వీలైనంత త్వరగా ఒక ఊరటను కోరుకోవడం మంచిది కాదు, ఆమోదయోగ్యమూ కాదు. కుమిలి పోకుండా జీవితంలోని కర్మలను తగువిధంగా ప్రక్షాళన చేసుకోవడం మంచిది.
ఆది శంకరుల కాలానికి చెందిన ఒక కథను మీకు చెప్తాను.
ఆదిశంకరులు తమ శిష్యులతో కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక బీద రైతు ఆయన వద్దకు వచ్చి ఒక ప్రశ్నను అడిగాడు.
రైతు 'ఓ మునివర్యా! నేను భగవంతునికి నా ప్రేమను ఎలా చూపగలను? నాకు ప్రార్థించడం రాదు. మీరు ఏమైనా మార్గం చూపగలరా?
ఆదిశంకర్లు ఇలా ప్రశ్నించారు 'ఇంట్లో నీవు ఎవరినైనా ఇష్టపడతావా?'
రైతు ఇలా అన్నాడు 'అవును. నాకు ఒక చిన్న మేక పిల్ల ఉంది. అది చాలా సున్నితమైనది, చిన్నది. నాకు అదంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఉన్న వారందరి కంటే, దాన్నే నేను ఎక్కువగా ప్రేమిస్తాను.'
ఆదిశంకరులిలా అన్నారు 'నీవు నీకు నచ్చినవన్నీ ఆ మేక పిల్లకు చెయ్యి. దాన్ని మరింత ప్రేమించు. నీవు దైవాన్ని చూడగలుగుతావు.'
శిష్యులు నవ్వి ఇలా అనుకున్నారు 'మా గురువుగారు ఎంత కుటిలులు? రైతును సంతోష పెట్టడానికి ఏదో ఒక జవాబు ఇచ్చారు. మేకపిల్లను ప్రేమించడం ద్వారా రైతు దైవాన్ని ఎలా ప్రేమించగలుగుతాడు? ఆయన జ్ఞానం గురించి, వైరాగ్యం గురించి ఎంతో చెప్తారు. దైవాన్ని చేరుకోవడానికి జ్ఞానము, వైరాగ్యం ఎంతో అవసరం.
కొన్ని నెలల తర్వాత ఆదిశంకరులు ఆ గ్రామం గుండా మరలా వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన ఆ రైతును కలిశారు.
ఆ రైతు ఇలా అన్నాడు 'మీరు సూచించినట్లుగా నేను నా మేక పిల్ల పట్ల మరింత ప్రేమతో శ్రద్ధ వహించాను. నిజంగా దానిని ఎంతగానో ఇష్టపడడం మొదలుపెట్టాను. ఈ మధ్యన ఆ మేక పిల్ల నుంచి ఒక అందమైన వెలుగు ప్రసరిస్తోంది. ఆ ప్రశాంతమైన వెలుగులో చతుర్భుజాలు కలిగిన ఒక వ్యక్తి నిలుచుని, నన్ను చూసి నవ్వడం నేను కనుగొన్నాను.
ఆది శంకరులు తన శిష్యుల వంక చూసి, చిరునవ్వు నవ్వారు. వారంతా సిగ్గుతో తమ తలలు వంచుకున్నారు.
కాబట్టి భగవంతునితో ఐక్యతను పొందేందుకు, భక్తి ఎంతో ప్రధానమైన అంశం.
No comments:
Post a Comment