గణతంత్ర దినోత్సవము - అచ్చంగా తెలుగు

గణతంత్ర దినోత్సవము

Share This

గణతంత్ర దినోత్సవము

సుజాత తిమ్మన..


భారతీయుల ఆత్మస్తైర్యానికి ప్రతీకగా ..
అమర వీరుల త్యాగ నిరతిని చాటుతూ...
మూడు రంగుల మధ్య అశోక చక్రంతో..
గగనసీమలో రెప రెప లాడుతుంది పతాకం..
అహింసనే ఆయుధంగా చేసుకొని.
1947 లో సత్యాగ్రహం ఆయుధంతో..
సహనం ఉపిరితో...సాదించిన స్వాతంత్రం
1950 లో అధికారికంగా ప్రకటితమై....
ప్రజా ప్రభుత్వమై..నిలిచి ..జనులకు వరమైనది.......
కుల మత జాతి బెదాలను మరచి 
ప్రాంతీయ తేడాలను విడిచి ....దేశమంతా ఒకటిగా ..
"జనగణ మన "  నిజనిదించే  ఠాగూర్ గీతం..
ప్రతీహృదయాన్ని మేల్కొలిపే అమర దీపమై... ...
సైనికుల క్రమశిక్షణ తో కూడిన విన్యాసాలతో....
బాలబాలికల నృత్య సంగీతాలతో...
అభివృద్ధి ....సమైక్య సంస్కృతుల ప్రదర్సనలతో..
డిల్లీ రాజ్ భవన్ మార్గమంతా.బారులు తీరిన ..సందడే..
దూర దర్శన్ లో చూస్తున్న మనకి కన్నుల పండుగే..
జై హింద్ నినాదాల సంబరమే కాదు ...
ప్రతి వ్యక్తీ ఒక శక్తి అయి ..
దేశాభ్యున్నతికి పాటు పడతానని 
ఎవరికీ వారు ఆత్మ పరిశీలతో ప్రతిజ్ఞ చేసుకోవాలి..
ఈ గణతంత్ర దినోత్సవమున..!!
*****    *****     *****

No comments:

Post a Comment

Pages