చిట్కాలు - అచ్చంగా తెలుగు

చిట్కాలు

Share This
చిట్కాలు
- సాయి ప్రియ

1) రాగి చెంబులో రాత్రిపూట నీళ్ళుపోసి,9 తులసి ఆకులువేసి ఉదయం ఆకులుతిని నీళ్ళు త్రాగితే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.
2) 1 స్పూను మెంతులు ఒకగ్లాసు నీళ్ళల్లో వేసి ఉదయం ఆ గింజలు తిని నీళ్ళు త్రాగితే ఆరోగ్యంగా వుంటారు.
3) ముల్లంగి రసం 1/4 గ్లాసు ఉదయం,సాయంత్రం తీసుకుంటే అధికబరువు తగ్గుతారు.
4) మెంతులు ఒకస్పూను మునిగేవరకు నీళ్ళుపోసి నానబెట్టి ఆనీళ్ళు పారబోసి మెంతులు నమిలితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
5) ఆహరం తిన్నతర్వాత వెల్లుల్లి రేకలు నాలుగు పొట్టుతీసి తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.బి.పి,షుగరు,గుండె సంబంధ వ్యాధులకు మంచిది.
6) మొక్కజొన్న పొత్తు పీచు లేతది ఏదోఒకరకంగా కూరల్లో 10,15రోజులు తింటే మూత్రపిండాలలోని రాళ్ళు కరిగిపోతాయి.
7) వాము,రాళ్ళ ఉప్పు సమానంగా తీసుకుని పొడిచేసి పళ్ళు రుద్దితే దంతసమస్యలు ఉండవు.
8) ఉసిరికాయలపొడి ఏదోఒక రూపంలో తింటే యవ్వనంగా ఉంటారు.
9) మందారాకు,పువ్వులు నువ్వులనూనెలో కాచి ,తలకు రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలదతాయి.
10) తమలపాకులు,10 మిరియాలు కలిపి తింటే 20రోజుల్లో సన్నగా ఉన్నవాళ్ళు బరువు పెరుగుతారు.

No comments:

Post a Comment

Pages