సుబ్బుమామయ్య కబుర్లు! - 2
తోడబుట్టినవాళ్లు
పిల్లలూ, తోడబుట్టినవాళ్లంటే మీకు తెలుసుగా..రక్తసంబంధం, అదేనర్రా మన అన్నయ్యలు, అక్కయ్యలు, తమ్ముళ్లు, చెల్లెళ్లూను. మనకి బయట ఎంతోమంది మిత్రులుండవచ్చు. స్నేహం కోసం ప్రాణం ఇచ్చే వాళ్లూ ఉండొచ్చు. కానీ ఎంతైనా మనవాళ్లు మనవాళ్లే! పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనతోపాటు ఉండేది వాళ్లే! మన ఆనందానికి సంతోషిస్తారు. బాధపడితే కుంగిపోతారు. తోడబుట్టిన వాళ్ల గురించి చెప్పాల్సివస్తే మనకు గుర్తొచ్చేది రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు. ఇంట్లోనైనా, ఆశ్రమంలో విద్యనభ్యసించేటప్పుడైనా, ఎంత చక్కగా కలిసి మెలిసి ఉండేవాళ్లో. లక్ష్మణుడేమో ఎప్పుడూ రామచంద్రుణ్ని అంటిపెట్టుకునే ఉంటాడు. అన్నయ్య మీద ఈగ వాలనియ్యడు. ఇహ భరతుడి గురించి తెలిసిందే, వాళ్లమ్మ కైకేయి రామయ్యను అరణ్యాలకు పంపించి తన కొడుకైన భరతుడికి రాజ్యం కట్టబెట్టాలనుకున్నప్పుడు, భరతుడు కన్నీళ్లతో అన్నయ్య పరిపాలించవలసిన రాజ్యం తనకు వద్దంటే వద్దని రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి, వాటిని సింహాసనం మీద పెట్టి శ్రీరామచంద్రుడి తరపున రాజ్యపాలన సాగించాడు. అలాగే పాండవులు. అయిదుగురూ పిడికిట్లోని వేళ్లలా ఎంత ఐకమత్యంగా ఉండేవారనీ! అన్నయ్య ధర్మరాజుమాట కలలో కూడా జవదాటేవారు కాదు. ఆయనమాట వేదం వాళ్లకు.
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments