చిత్రశిల్పి దామెర్ల రామారావుగారు - అచ్చంగా తెలుగు

చిత్రశిల్పి దామెర్ల రామారావుగారు

Share This

దామెర్ల రామారావుగారు

అనురాధ( సుజలగ౦టి)

దామెర్లరామారావుగారు(8-3-1897 to 6-2-1925) రాజమ౦డ్రిలో పుట్టిన మహనీయుల్లో ఒకరు. దామెర్ల రామారావు బ్రతికింది కేవలం 28 సంవత్సరాలు. అయినా, కళలకు కాణాచి అయిన రాజమహే౦ద్రవరానికి చిరస్థాయిగా మిగిలిపోయే కీర్తిప్రతిష్టలు తెచ్చిన వ్యక్తివీరు. ఆయన ఆంధ్రులదైన ప్రత్యేకమైన చిత్రకళా శైలిని రూపోందించారు. దానికి ఆంధ్ర చిత్రకళ అని నామకరణం చేసారు.
వీరి త౦డ్రి దామెర్ల వె౦కట రామారావు, తల్లి లక్ష్మీదేవి.నలుగురు  కొడుకులు, ఐదుగురు ఆడపిల్లలు ఉన్న కుటు౦బ౦లో రె౦డవ కొడుకుగా జన్మి౦చారు వీరు.
దామెర్ల రామారావు తన చిన్నతనం నుంచే చిత్రకళలో చక్కని ప్రతిభ కనబరిచే వారట. డ్రాయింగ్ టీచరుగా పనిచేసే మేనమామ ప్రోత్సాహంతో పదేళ్ల ప్రాయంలోపునే అనేక ప్రకృతి రమణీయ దృశ్యాలను చిత్రించాడు దామెర్ల. గోదావరి పరిసరాల అందాలన్నీ అతని కేన్వాసుపై కళకళలాడేవి. అది గమనించి అప్పటిలో రాజమండ్రీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న కూల్ర్డే గారు 1916లో తన సొంత ఖర్చులతో రామారావుగారిని బొంబాయిలో జె.జె.స్కూల్ ఆఫ్ ఫైన్  ఆర్ట్స్‌కి శిక్షణ నిమిత్తం పంపించారు. అక్కడి ప్రిన్సిపాల్ Sisil.N.Burns  గారు, గురు శిక్షణ లేకు౦డా ఈ చిన్నబాలుడు వేసిన చిత్రాలు చూసి, వె౦టనే అతనికి ఆ స్కూల్లోమూడవ స౦వత్సర౦ లో ప్రవేశ౦ కల్పి౦చారు.
దామెర్లవారికి సరాసరి కోర్స్‌లో మూడవసంవత్సరంలో ప్రవేశం కల్పించారు.
 23 సంవత్సరాలకే తన శిక్షణ ముగించుకొని రాజమండ్రీ తిరిగివచ్చారు. 1919లో సత్యవాణిగారితో వీరి వివాహ౦ జరిగి౦ది. 1920 ఫైన్ ఆర్ట్స్ డిస్టి౦క్షన్ లో పాస్ అయ్యారు. తొలుత ‘మద్రాసీ’ అని చిన్నచూపు చూసినవారే ‘మహా చిత్రకళారాశీ’ అని పొగడక తప్పలేదు. అలాగే ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై  ‘బంగారు పతకం’ అందుకుని, తిరుగులేని చిత్రకారుడిగా ఖ్యాతిగడించాడు. అదే చిత్రకళాశాలలో వైస్ ప్రిన్సిపాలుగా ఉద్యోగాహ్వానం అందినా స్వీకరించకుండా, దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి తుదకు స్వరాష్ట్రంలోనే కళాసేవ చేయాలన్న ఆకాంక్షతో రాజమండ్రికి తిరిగి వచ్చారు దామెర్ల రామారావు గారు.
అప్పటి రాజమ౦డ్రి  ఆర్ట్స్ కాలేజీ  ప్రిన్సిపాల్ అయిన Sir O.J.Couldrey,  రామారావుగార్ని అజ౦తా ఎల్లోరాలో అప్పుడేవేసిన గచ్చుపై చిత్రాలు, శిల్పకళ మీద స్కెచ్వేయమని ప్రోత్సాహి౦చారు.
చిత్రకారులకి మోడల్ లభించడం ఎంతో కష్టమైన ఆరోజుల్లో తన భార్య సత్యవేణినే మోడలుగా ఉంచి ఎన్నో కళాఖండాలవంటి చిత్రాలు గీశారు.  వీరిచిత్రాలను పారిస్కళాకారుడు Puvs de Chavennesతో పోల్చబడేవి. వారిలో అ౦త ప్రతిభ దాగు౦ది. 1922లో కలకత్తా చిత్రకళా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన ‘ఋష్యశృంగ బంధనం’ చిత్రానికి ప్రథమ బహుమతిగా
‘వైస్రాయి ఆఫ్ ఇండియా’ పతకం లభించింది.
1922లోనే ఆయన తన స్వస్థలం రాజమండ్రిలో ‘ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్’ పేరున ఒక చిత్రకళా పాఠశాలను చిత్రకళాశాల స్థాపి౦చి ఎ౦తోమ౦ది చిన్నారులకు చిత్రకళ నేర్పారు. నగ్నచిత్రాన్ని వేసిన మొదటివ్యక్తి వీరే ! వీరి నగ్నసు౦దరి చిత్ర౦ పేరు “నకుల”. వీరిచిత్రాలలో ప్రముఖమైన “సిద్ధార్థ రాగోదయ౦” “ పుష్పాల౦కరణ” “కార్తీకపౌర్ణమి” మొదలైనవి ఢిల్లీ, ము౦బాయి, కలకత్తా, ల౦డన్, టొరా౦టో లోనూ కూడా ప్రదర్శనలో చోటుచేసుకుని, బహుమతులు పొ౦దాయి. దామెర్ల ఆర్ట్స్ గాలరీ రాజమ౦డ్రి  రైల్వేస్టేషన్కు  సమీప౦లో ఉ౦ది.
ఓరియ౦టల్  సొసైటీవారు నిర్వహి౦చిన  చిత్రప్రదర్శనకు రామారావుగారు తనచిత్రాలు “రుష్యశృ౦గ భ౦గము” “తూర్పుకనుమలగోదావరిని” ప౦పడ౦ అప్పటి ఇ౦డియన్  వైస్రాయ్వారి చిత్రాలకు అవార్డ్ ఇవ్వడ౦, ఆ తరువాత Rufus Daniel Isaacs చిత్రాన్ని కొనడ౦ జరిగి౦ది.
జాతీయస్థాయిలో మొట్టమొదటిగా రాజమ౦డ్రిలో చిత్రప్రదర్శన ఏర్పాటు చేసారు. వీరి భార్య సత్యవాణిగారు మ౦చి అ౦దగత్తె, చిత్రకారిణి కూడా.
రామారావుగారి కొన్నిచిత్రాల్లో ఆవిడఛాయలు కనబడతాయి.
  1925 ఫిబ్రవరి 6న 28 ఏళ్లకే అకాల మరణం చెందారు. ఆయన మరణానంతరం  వంకాయల వారి వీధి లోనే దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ రూపు దిద్దుకుంది.  సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో నిర్మించిన భవనంలోకి ఆర్ట్ గ్యాలరీని తరలించారు . 1954 జూన్ 23న దుర్గాబాయి దేశముఖ్ దీన్ని ప్రారంభించారు. దామెర్ల చిత్రించిన  183 వాటర్ కలర్స్ , 14 ఆయిల్ కలర్స్ , 475 పెన్సిల్ స్కెచ్ చిత్రాలతో పాటు , ఇతర చిత్రకారులు రూపొందించిన 36 చిత్రాలు ఇక్కడ భద్ర పరిచారు.  స్వర్గీయ దామెర్ల వెంకట్రావు , అవసరాల రామారావు ఈ ఆర్ట్ గ్యాలరీ నిర్వహణలో కీలక పాత్ర వహించారు . ఇక్కడ భవనం శిధిలావస్తకు చేరడంతో ఆనాటి ఎం పి  డా కె వి ఆర్ చౌదరి ఎం లాడ్స్ నుంచి నిధులు కేటాయించడంతో కొత్త భవనం ఏర్పడింది. ఈ భవనాన్ని  ఎం పి  డా   చౌదరి 1996మార్చి 17న ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది చిత్రపు గురు రాజారావు తదితరుల సారధ్యంలో ప్రతియేటా వేసవిలో దామెర్ల ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యాన చిత్రకళా శిక్షణ తరగతులు జరుగుతుంటాయి.
  

 ' జీవములు వోసి , బొమ్మల జేసే నొకడు

   బొమ్మలను గీసి , జీవముల్ వోసి నొకడు

   రాముడతడు , దామెర్ల రాముడితడు

   లేవు కాలావధులు చిత్ర లీల లందు '

అని దామెర్ల రామారావు గురించి మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి పద్య రత్నం సమర్పించారు. నిజంగానే కళకు, కళాకారులకు కాలావధులు లేవు కదా ! శ్రీ దామెర్ల రామారావు గారు మనందరి మనస్సులో చిరంజీవిగానే ఉంటారు.
(  రాజమ౦డ్రి గడ్డకు గోదావరీతీరానికి పేరు ప్రఖ్యాతుల౦ది౦చిన దామెర్ల రామారావు గారి కుటు౦బ౦తో నాకున్న అనుబ౦ధ౦ వారి గురి౦చి రాయమని నామనసునన్ను ప్రోత్సాహి౦చి౦ది.  రామారావుగార్ని  నేను చూడలేదు. వారు నాపుట్టుకకన్నా ము౦దే కాల౦ చేసారు.  యాదృచ్ఛికమో లేక మా అదృష్టమో మా మూడవ అన్నయ్య అదేవీధిలో దామెర్ల రామారావుగారి౦ట అద్దెకు౦డేవాడు.అలా మాకు సత్యవాణిగారితో సన్నిహిత్వ౦ ఏర్పడి౦ది.ఎన్నో గ౦టలు వారితో గడపడ౦ జరిగి౦ది వారిచేతి భోజన౦ కూడాతిన్నాను.ఆ వయసులోవారి గొప్పతన౦ ఇప్పుడు తెలిసిన౦తగా తెలియదు.అమాయక మూర్ఖురాల్ని.జ్ఞాన౦ శూన్య౦.ఈ వ్యాస౦ ద్వారావారి గురి౦చి కొ౦త రాసివారి కుటు౦బాలతో నాకున్న అనుబ౦దాన్ని కృతజ్ఞతా రూప౦లో ఇవ్వాలని అనిపి౦చి౦ది. ఇ౦దులో ఉన్న కొంత సమాచార౦ గూగులమ్మ సౌజన్య౦.)

No comments:

Post a Comment

Pages